కరోనా సృష్టించిన ఒత్తిడికి యోగా అద్భుతమైన పరిష్కారం : వెంకయ్య నాయుడు

Reddy P Rajasekhar

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నారో అదే విధంగా యోగాను కూడా నేర్పించాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. స్పిక్ మెకే సంస్థ నిర్వహించిన ‘డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన ఆన్ లైన్ లో మాట్లాడారు. 
 
కరోనాపై పోరాడటానికి ప్రజలు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. కరోనా సృష్టించిన అధిక స్థాయి ఒత్తిడికి యోగా అద్భుతమైన పరిష్కారమని వ్యాఖ్యలు చేశారు. కొందరు యువకులు కరోనా సోకితే ఒత్తిడితో జీవితాన్ని ముగిస్తున్నారని ఆ సమస్యను యోగాతో నివారించవచ్చని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: