తమిళనాడులో ఒక్క రోజే రెండు వేల కేసులు...!

తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతున్నాయి గాని తగ్గడం లేదు. నిన్న కూడా అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు రెండు వేల కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1927 కేసులు నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. 

 

ఇక చెన్నై లో ప్రతీ రోజు వెయ్యి కి పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అక్కడ 1392 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్యా 36841 కి చేరుకుంది. అయితే మరణాలు మాత్రం అక్కడ చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక చెన్నై లో లాక్ డౌన్ సడలింపులు వద్దు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: