నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. మోడీ ఏం ప్రకటిస్తారో..!
ఈ రోజు రాత్రి 7గంటలకు కేంద్ర కేబినెట్ కీలక భేటీ నిర్వహించబోతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ కీలకంగా చర్చించనున్నట్లు ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.
అంతేగాకుండా.. భారత్, చైనా సరిహద్దులో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ఏం చెబుతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.