చంద్రబాబుపై విరుచుకుపడిన మంత్రి అనిల్కుమార్యాదవ్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్లోని ఇంట్లో ఉంటున్న చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని మంత్రి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మంత్రి అనిల్కుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మంచి చేయకపోయినా పర్వాలేదుగానీ.. ప్రజలను మాత్రం భయపెట్టొద్దని ఆయన హితవు పలికారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. చంద్రబాబు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని, హైదరాబాద్లో ఉండి లేఖలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో కనీసం సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆఖరికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైనా కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ లో ప్రజలకు ఇబ్బందలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన ఆయన అన్నారు.