హీరోయిన్ పాత్ర‌లకు స్టార్ డ‌మ్ తీసుకొచ్చిన వాణిశ్రీ... నేడు జ‌న్మ‌దినం..

Spyder
ద‌క్షిణాది తెర‌పై ఓ వెలుగు వెలిగారు నాటి త‌రం మేటి హీరోయిన్ వాణిశ్రీ. ఆమె ద‌క్షిణాది అగ్ర హీరోలంద‌రితో న‌టించారు. అమె న‌టించిన సినిమాల్లో 70శాతం హిట్లే ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌థ‌ల ఎంపిక‌లో హీరోయిన్ పాత్ర‌పై ద‌ర్శ‌కుల‌తో చాలా క్లారిటీగా ఉండేదంట‌. క‌థ‌లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌నే ఆమె ఎంచుకునేవార‌ని ఆమె స‌న్నిహితులు చెబుతుంటారు. ఆమె న‌టించిన కొన్ని సినిమాలు విఫ‌ల‌మైన‌.. పాత్ర‌ల‌కు మంచి పేరు రావ‌డం వెనుక అసలు నిజం అదేన‌ని చెబుతంటారు. వాణిశ్రీ  1948, ఆగష్టు 3, నెల్లూరులో జ‌న్మించారు. వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. నాదీ ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినపుడు ఎస్. వి. రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టాడు.

వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బి. వి. ఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నది. తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మకాం మద్రాసుకు మార్చింది. వాణిశ్రీకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలని ఉండేది. లలిక కళలపై ఆసక్తి ఉండేది. మద్రాసుకు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం వీణ, నాట్యం నేర్చుకుంది. మెట్రిక్యులేషన్ తో చదువుకోవడం నిలిపివేసి మూడేళ్ళ పాటు భరతనాట్యం నేర్చుకున్నది. ముందుగా టి. ఆర్ మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తర్వాత వెంపటి చినసత్యం దగ్గర సుదీర్ఘకాలం పాటు నాట్యాన్ని అభ్యసించింది.

) 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్తకన్నీరు నాటకంలో కథానాయకుడి భార్యగానూ, చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మగా నటించి నాటక ప్రియుల అభిమానం పొందింది.
చిట్టెమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హుణనూరు కృష్ణమూర్తి తన చిత్రం వీరసంకల్పలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజామహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఒక వైపు తమిళ, కన్నడ అగ్రకథానాయకులైన ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించింది. ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపిస్తుంది.

ఆమెకు నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. అందులో యముడిగా ఎన్. టి. ఆర్ నటించాడు. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార అని చెప్పాలి. ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: