మూత్రపిండాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే..?

Purushottham Vinay
మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. కానీ నేటి కాలంలో చాలా మంది కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు ఇంకా విష పదార్థాలు ఎక్కువవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు అనేవి ఏర్పడతాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ ఇంకా ఫాస్పేట్ వంటివి ఉంటాయి. ఎప్పుడేతే మూత్రంలో ఈ పోషకాల శాతం ఎక్కువవుతుందో అవి మూత్రపిండాల్లో కొద్ది కొద్దిగా పేరుకుపోయి చిన్న చిన్న రాళ్ల లాగా మారతాయి. ఈ రాళ్లు క్రమంగా పెద్దవి అయ్యి ఖచ్చితంగా చాలా తీవ్రమైన నొప్పికి దారి తీస్తాయి.ఇక మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా మూత్రాశయం, మూత్రనాళాలు కూడా బాగా దెబ్బతింటాయి. మూత్రంలో క్యాల్షియం ఇంకా ఆక్సలేట్ శాతం ఎక్కువగా ఉండడం వలే 80 శాతం మూత్రపిండాల్లో ఎక్కువగా రాళ్లు వస్తూ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు క్యాల్షియం ఇంకా ఆక్సలేట్స్ ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇంకా అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి.


మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం పెరిగే కొద్ది నొప్పి, బాధ ఎక్కువవడంతో పాటు వీటిని తొలగించడానికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కొన్ని హెల్తీ వాడడం వల్ల మనం చాలా సులభంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు.ముందుగా మీరు ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక మొక్కజొన్న పీచును వేసి నీళ్లు సగం అయ్యే దాకా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. తరువాత వీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇంకా 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రెండు పూటలా భోజనం చేసిన 40 నిమిషాల తరువాత మీరు తీసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఈ టీ ని తాగడం వల్ల ఖచ్చితంగా మనం చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా అలాగే మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో ముల్లంగి విత్తనాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. ముల్లంగి విత్తనాలతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: