అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా?

VAMSI
అమ్మాయిలు అనగానే అందం అనే పేరు తప్పకుండా గుర్తొస్తుంది. అయితే వారి అందమైన ముఖం కోసం ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్, రకరకాల ఫేస్ వాష్ లు ఇలా చాలానే వాడుతుంటారు. కొందరు తెల్లగా మెరిసిపోవాలని, మరి కొందరు స్కిన్ గ్లో అవ్వడం కోసం, ఇలా రకరకాల కారణాల వలన పలు రకాల బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతుంటారు. ఎవరైతే ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారో వారికి ఈ చిన్న టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి. చాలా మంది ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవాలని ఎన్నో రకరకాల పద్దతులను అంటే క్రీమ్స్, జల్స్ వంటివి వాడటం చేస్తుంటారు కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. 

ఆ అవాంఛిత రోమాలు అనేవి పోతేనే కానీ మన నిజమైన చర్మ సౌందర్యం కనిపించదు. అవి లేకపోతే చర్మం మరింత అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. 
కాగా కొందరు నిపుణుల సలహా మేరకు ముఖంపై ఉన్నటువంటి అవాంఛిత రోమాలను తొలగించడానికి ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం జరుగుతోంది. ఇంతకీ  అవేంటో చూద్దాం పదండి. పసుపు అనేది వంటలకు, అందానికి, ఔషధంగా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించాలని కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెంచా పసుపును తీసుకుని, అందులో రెండు చెంచాల సెనగ పిండి వేయండి, పాలు వేసి  పేస్టులా కలుపుకోవాలి. అనంతరం ఆ పేస్టును ముఖానికి అప్లై చేసుకుని దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అలాగే ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
* నిమ్మకాయ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్న నిమ్మకాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం తెలిసిందే. ఇది చర్మానికి సహజమైన బ్లీచింగ్ లా వినియోగించుకోవచ్చు తద్వారా ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి కాంతి వంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను మాయం చేయడానికి ఉపయోగపడే ఎక్స్‌ఫోలియేటర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది.
ఇపుడు ఇది ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో, రెండు కప్పుల వరకు చక్కెరను వేయాలి అందులో అర చెక్క లేదా పూర్తి నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేస్తూ పదినిమిషాల పాటు  మర్దన చేసుకోవాలి. ఒక అరగంట ఆగి గోరు వెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. అంతే అవాంఛిత రోమాలకు ఇలా గుడ్ బై చెప్పేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: