LIC: ఈ పాలసీతో 4 ఏళ్లలో కోటీశ్వరులు అవ్వొచ్చు!

Purushottham Vinay
ఇక సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ పెట్టుబడుల విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌నే విశ్వసిస్తారు.బ్యాంకులతో పోలిస్తే ఎల్‌ఐసిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం వల్ల వడ్డీలో సాపేక్షంగా ఎక్కువ రాబడి అనేది లభిస్తుంది. డబ్బు పోతుందనే భయం కూడా అసలు ఉండదు. ఈ lic కి సంబంధించి.. వివిధ పాలసీలలో పెట్టుబడి పెట్టినప్పటికీ, చాలా మందికి కూడా అసలు ఈ lic లోని ఇతర పాలసీల గురించి తెలియదు. ఈ lic పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం వల్ల రూ.1 కోటి వరకు కవరేజీని పొందవచ్చు. ఇందులో పెట్టుబడి కాలం కూడా చాలా తక్కువే.ఇక ఆ పెట్టుబడిన కేవలం 4 సంవత్సరాలు ఉంచినట్లయితే.. కోటి రూపాయల వరకు కూడా లభిస్తుంది.ఇక ఈ lic పాలసీలలో ఉత్తమమైన ప్లాన్‌లలో ఒకటి జీవన్ శిరోమణి పథకం. ఈ పథకమే తక్కువ వ్యవధిలో పెట్టుబడిదారులను త్వరగా లక్షాధికారులు చేస్తుంది.ఈ జీవిత బీమా సంస్థ lic జీవన్ శిరోమణి పథకాన్ని 19 డిసెంబర్ 2017 వ తేదీన ప్రకటించింది.ఇక ఈ పథకం కింద పెట్టుబడిదారులు 4 సంవత్సరాలలో రూ. 1 కోటిని పొందవచ్చు.ఇది నాన్ లింక్డ్ ఇంకా పరిమిత ప్రీమియం చెల్లింపు మనీ బ్యాక్ పథకం.


అలాగే ఈ పథకంలో తీవ్రమైన అనారోగ్య వ్యక్తులకు రక్షణ కూడా ఉంది.జీవన్ శిరోమణి పథకంలో పెట్టుబడిదారుడు పాలసీ వ్యవధిలో కనుక మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది.ఈ స్కీమ్‌లో ప్రీమియం వార్షికంగా, ద్వైవార్షికంగా, త్రైమాసికంగా ఇంకా నెలవారీగా చెల్లించవచ్చు.ఈ పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.ఇక ఈ పాలసీ వ్యవధిలో పెట్టుబడిదారుడు చెల్లించిన ప్రీమియం ఆధారంగా రుణం కూడా మంజూరు చేస్తారు.ఈ పాలసీ కనీస నగదు విలువ రూ. కోటి. ఇంకా గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.ఈ పాలసీ కాలపరిమితి 14, 16, 18, 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ మీరు ప్రీమియం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఈ పాలసీకి కనీస వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: