తెలంగాణలో ఆ కులంవారికి గుడ్ న్యూస్?
గొర్రెల యూనిట్ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఆవిష్కరించారు. 8వ తేదీన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.