రేవంత్ చెప్పిన రహస్యంతో.. నిరుద్యోగుల గుండెల్లో మంటలు?
జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని హై కొర్టు చెప్పినా రహస్యంగా ఉంచుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆరెస్ లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారని.. విమర్శించారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.