ఏపీలో ఇంటర్ పరీక్షలు.. ఈ రూల్స్ మస్ట్?
20-25 పరీక్షా కేంద్రాలకు ఒక 108 అంబులెన్సు సేవలను అందుబాటులో ఉంచాలని.. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని.. ప్రశ్నాపత్రాలు లీకేజి, మాల్ ప్రాక్టీస్ తదితర వదంతులను నియంత్రించాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్సు కేంద్రాలు/పొటో కాపీయింగ్ కేంద్రాలను మూసివేయించాలని.. సూచించారు. రాష్ట్రంలో మొత్తం 10,03,674 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు.