ఏపీలో ఇంటర్‌ పరీక్షలు.. ఈ రూల్స్ మస్ట్‌?

Chakravarthi Kalyan
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి.. ఈనెల 15 నుండి ఏప్రిల్ నాలుగు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని సీఎస్‌ జవహర్‌ రెడ్డి సూచించారు.
20-25 పరీక్షా కేంద్రాలకు ఒక 108 అంబులెన్సు సేవలను అందుబాటులో ఉంచాలని.. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని.. ప్రశ్నాపత్రాలు లీకేజి, మాల్ ప్రాక్టీస్ తదితర వదంతులను నియంత్రించాలని సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్సు కేంద్రాలు/పొటో కాపీయింగ్ కేంద్రాలను మూసివేయించాలని.. సూచించారు. రాష్ట్రంలో మొత్తం 10,03,674 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరు  కాబోతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: