కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ను జనం దున్నేస్తారా?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వమే ఉంటే ప్రజలకు చిప్పులు చేతులో పట్టుకోవడమే మిగులుతుందని విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ పై ప్రజల్లో కనీసం చర్చ లేదని, కేసీఆర్ మాటలు ప్రజలు విశ్వసించడం లేదని ధ్వజమెత్తారు. చేనేత బంధు ఎంత మందికి ఇచ్చారు? ఒక్క బతుకమ్మ చీర ఇచ్చి వారి బతుకు బర్ బాద్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.
పోడు పట్టాలు ఇస్తానని ఎనిమిదిన్నరేండ్లుగా ఇవ్వలేదని.. ఇప్పుడు ఇస్తామని అంటున్నారని.. ఇన్ని రోజులు దస్త్రం ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలెన్ని...? నెరవేర్చినవి ఎన్ని...? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కు వయసు మీద పడింది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని బండి సంజయ్  తప్పుపట్టారు. డిమాండ్‌ చేశారు. పోడు   భూములకు ఎలాంటి లింకులు పెట్టకుండా పట్టా ఇవ్వాల్సిందేనని.. లేదంటే పేద ప్రజలు నీ ఫామ్ హౌజ్ దున్నడం ఖాయం అని ఆయన బండి సంజయ్  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: