గాంధీజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్..!
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా.. ఒక్కొక్కటి అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.