తెలంగాణను ఫాలో కావాలంటున్న మంత్రి విడదల రజని?
ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల సమాచారాన్ని తెప్పించుకోవాలని ఉన్నతాధికారులు కృష్ణబాబు, జె.నివాస్ లను మంత్రి విడదల రజని ఆదేశించారు. సికిల్ సెల్, తలసేమియా వ్యాధులపైనా అవగాహన కల్పించాల్సిందిగా మంత్రి విడదల రజని సూచించారు. ఉద్దానంలో నెఫ్రాజిస్టుల సేవలను రూ. 5 లక్షల వరకూ ప్యాకేజీ ఇచ్చి నెఫ్రాలజీ నిపుణుల్ని నియమించుకోవాలన్నారు.