ఆన్‌లైన్‌లోనే ఉప్పల్ వన్డే టికెట్లు.. పాస్ మస్ట్?

Chakravarthi Kalyan
ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ వన్‌ డే మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. నాలుగేళ్ల తర్వాత ఈ సందడి ఉందని  హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అజారుద్దీన్ వెల్లడించారు. ఈ నెల 13నుంచి అన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయని  హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు.

ఆఫ్‌లైన్ టికెట్లు అమ్మడంలేదని..ఆన్‌లైన్‌లో పెటిఎంలో మాత్రమే విక్రయిస్తామని అజారుద్దీన్ తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చీబౌలి స్టేడియంలలోఈ నెల 15నుంచి 18 వరకు ఉదయం పది నుంచి మూడు గంటల వరకు ఫిజికల్‌ టికెట్లు తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్  సూచించారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు నగరానికి వస్తుందన్న అజారుద్దీన్‌ పదహేనో తేదీన ప్రాక్టీసు చేస్తుందని పేర్కొన్నారు. భారత జట్టు 16వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. పదిహేడో తేదీన ఇరు జట్లు ప్రాక్టీసు చేస్తాయని వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: