తిరుమలలో ధరలు మరీ ఇంతగా పెంచేస్తారా?
తిరుమలలో గదుల ధరలను ఆకాశాన్ని అంటే రీతిలో పెంచేశారని సోము వీర్రాజు ఆవేదన చెందారు. రూ.150 ధరలు ఉన్న ఒక్కో గదిని రూ.1700 పెంచారన్న సోము వీర్రాజు.. మధ్యతరగతి, సామాన్య భక్తులు ఇంత భారం భరించలేరన్నారు. హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచడానికి ఉన్న ప్రభుత్వంగా వైసీపీ కనపడుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. తిరుమల విషయంలో పాలకమండలి ధర్మంగా వ్యవహరించకుండా దర్శనానికి వచ్చే భక్తులను ముక్కుపిండి వసూలు చేసే విధంగా ధరలను ఆమాంతం పెంచేశారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి రూ.1700 పెంచారంటే పాలక మండలి కాఠిన్యం హిందువులకు అర్ధం అవుతోందని సోము వీర్రాజు ఆరోపించారు.