సంక్రాంతి: ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ఎక్కడెక్కడికంటే ?
ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. జేబీఎస్ నుంచి 1,184 బస్సులను, ఎల్.బీ.నగర్ నుంచి 1,133 బస్సులను, ఆరాంఘర్ నుంచి 814 బస్సులను, ఉప్పల్ నుంచి 683 బస్సులను, కేపీహెచ్.పీ నుంచి 419 బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది. 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు www.tsrtconline.in వెబ్ సైట్ లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. జనవరి 31 లోపు తిరుగు ప్రయాణం చేసే వారికి 10శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ కూడా కల్పించారు.