జగన్‌.. ఆ ఓట్లలో గోల్‌మాల్‌ చేస్తున్నారా?

Chakravarthi Kalyan
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఎన్నికలను మార్చి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్యెల్సీ అభ్యర్థులు రాంగోల్ రెడ్డి, శ్రీకాంత్ కలిసి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపధ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చి 15 లోగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఫిర్యాదు చేశారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు ఆరోపించారు.

ఎన్నికలకు పది రోజుల ముందు కూడా ఓటు నమోదు చేసుకొనే అవకాశం వుండటంతో నకిలీ ఓటర్లను అడ్డుకోవడం కష్టంతో కూడిన పని అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అంటున్నారు. నకిలీ  ఓట్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: