కాంగ్రెస్ సిత్రాలు: ఏపీకి ఉత్తమ్.. పాండికి వీహెచ్?
ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ పీసీసీలు వి.హనుమంతురావు, ఉత్తమ్కుమార్ రెడ్డిలను పాండిచ్ఛేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పరిశీలకులుగా నియమించారు. తెలంగాణ రాష్ట్రానికి గోవా మాజీ పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ నియామించారు. వీరు ఆయా రాష్ట్రాలల్లో జరిగే పాదయాత్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదించాలి. నాయకుల మధ్య సఖ్యత లేనట్లయితే...సమన్వయం చేసి సక్రమంగా కొనసాగేట్లు చూడాలి.