గుడ్‌న్యూస్‌: గర్భిణులకు ఆ పరీక్ష అవసరం లేదు..?

Chakravarthi Kalyan
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రస్తుతం 9 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. దేహదారుఢ్య పరీక్షలు గతంతో పోలిస్తే కాస్త సులభతరమయ్యాయి. 70శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధిస్తున్నారని పోలీసులు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో గర్భిణీలకు మినహాయింపునిస్తున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.  దేహదారుడ్య పరీక్షల్లో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. తుది అర్హత పరీక్ష పాసైన నెలలోపు దేహ దారుడ్య పరీక్షలో పాల్గొని అందులోనూ అర్హత సాధిస్తేనే మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. దేహదారుడ్య పరీక్షల కోసం గర్భిణీ అభ్యర్థులు నిబంధనలు అంగీకరిస్తున్నట్లు లేఖ రాసివ్వాలని పోలీసు నియామక మండలి తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు గర్భిణీలకు ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: