ఆమెతో భర్తను అలా చూసింది.. తట్టుకోలేక ఏం చేసిందంటే?

Chakravarthi Kalyan
జీవితాంతం తోడుంటానని నమ్మించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతని బుద్ధిలో మార్పు వచ్చింది. పనిచేసే చోటే మరో మహిళతో చనువుగా ఉండటం ప్రారంభించాడు. ఆ భార్య ఇది తట్టుకోలేకపోయింది.. పద్ధతి మార్చుకోవాలని భర్తను హెచ్చరించింది. కానీ ఆ భర్తలో మార్పు రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆ భార్య.. తాను నివాసం ఉంటున్న భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఈ దారుణం జరిగింది. చింతలపూడి గ్రామానికి చెందిన భాగ్య రేఖ 13 సంవత్సరాల క్రితం జాలాది జగన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇరువురు సంతానం కలిగింది. భాగ్యరేఖ వాలంటీర్ గా పనిచేస్తుండగా అతని భర్త చేబ్రోలు మండలం నారాకోడూరు సచివాలయంలో ఉద్యోగ పని చేస్తున్నారు. కొంతకాలంగా అదే సచివాలయంలో పనిచేస్తున్న మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్త పద్ధతి మారకపోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: