తెలంగాణలో చంద్రబాబు సభ.. కేసీఆర్‌కు కొత్త సవాల్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో దాదాపు కనుమరుగైన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు మరోసారి ఉనికి కోసం పోరాడుతోంది. ఇవాళ ఖమ్మంలో శంఖారావం పేరుతో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ మైదానం వేదికగా టీడీపీ శంఖారావం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
టీడీపికి తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత తొలిసారి ఖమ్మంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ సందర్భంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలు ఏర్పాటు చేశారు.
ఈ సభకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి కార్యకర్తల సమీకరణ చేస్తున్నారు. దాదాపు 25 శాసనసభ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను అత్యధిక సంఖ్యలో సభకు తరలించాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా తన సత్తా చాటాలని టీడీపీ కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఊవ్విళ్లూరుతున్నారు. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ ఖమ్మం సభపై ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: