తెలంగాణలో చంద్రబాబు సభ.. కేసీఆర్కు కొత్త సవాల్?
టీడీపికి తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత తొలిసారి ఖమ్మంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ సందర్భంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలు ఏర్పాటు చేశారు.
ఈ సభకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కార్యకర్తల సమీకరణ చేస్తున్నారు. దాదాపు 25 శాసనసభ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను అత్యధిక సంఖ్యలో సభకు తరలించాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా తన సత్తా చాటాలని టీడీపీ కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఊవ్విళ్లూరుతున్నారు. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ ఖమ్మం సభపై ఉన్నాయి.