జగన్‌పైకి అమిత్‌షాను ఉసిగొల్పుతున్నారా?

Chakravarthi Kalyan
ఇటీవల అమిత్ షాతో ఏపీ ఎంపీ సీఎం రమేశ్ ను కలిశారు. ఇలా భేటీ అవడంతో సాధారణమే అయినప్పటికీ.. కొన్ని మీడియా ఛానెల్స్ ఇచ్చిన వార్తలు చూస్తే మాత్రం ఇదేదో ముఖ్యమైన భేటీగా అన్పిస్తుంది. ఏపీలో బీజేపీ కార్యకాలపాలపై అమిత్ షాకు సీఎం రమేశ్ నివేదిక అందించినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. వీరిద్దరు కాకుండా..వేరేవాళ్లు ఏపీలోని పార్టీ వ్యవహారాలపై చర్చించడం ఏంటనేది అసలైన ప్రశ్న.
దీన్ని బట్టి పార్టీ మీద ఆధిపత్యం ఉందని అమిత్ షా రుజువు చేసుకుంటున్నారా అని డౌట్. మరోవైపు బీజేపీ అధిష్ఠానం పార్టీలో ముందునుంచి ఉన్న వారిని కాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నమ్ముతుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ భేటీతో అసలు ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఏంటనేది అయోమయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: