ఇవాళ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనుంది. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిధిగా కమలదళపతి జేపీ నడ్డా హాజరుకానున్నారు. మధ్యాహ్నాం 2:10కి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్న నడ్డా... విమానాశ్రయంలో 2:10 నుంచి 2:50 వరకు 40 నిమిషాల పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు.
మధ్యాహ్నం 2 గంటల 50నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కరీంనగర్కు నడ్డా పయనం అవుతారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ హెలిప్యాడ్కు 3:30కి చేరుకుంటారు. 3:40 నుంచి 4:35వరకు సుమారు గంటపాటు సభలో నడ్డా సభలో ఉంటారు. తిరిగి
సాయంత్రం 5 గంటల 35నిమిషాలకు ప్రత్యేక విమానంలో నడ్డా తిరిగి ఢిల్లీకి వెళ్తారు.