గర్జనకు చంద్రబాబు రెడీ..మరి జగన్ సంగతేంటి?
కరోనా వల్ల జనాల్లోకి వెళ్లడాన్ని చంద్రబాబు బాగా తగ్గించారు. అన్నీ వర్చువల్ పద్ధతిలోనే కానిచ్చేశారు. లాస్ట్ కు నిరసనలు కూడా డిజిటల్ గానే తెలిపారు. కాగా.. ఎన్నికల ముందుండగా ఇలా ఉత్తరాంధ్ర పర్యటనతో ఓటు బ్యాంకుని పెంచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఈ పర్యటన కనుక విజయవంతం అయితే మరిన్ని సభలు నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీ ఉత్సాహం చూపించే ఛాన్స్ ఉంది.