జగన్ ఆస్తుల కేసు.. వైసీపీ ఎమ్మెల్యేకు షాక్‌?

Chakravarthi Kalyan
సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు షాక్ తగిలింది. ఆయనకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఇందూ హౌజింగ్ బోర్డు సంయుక్తంగా గచ్చిబౌలిలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగం ఉంది. కృష్ణప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి భాగస్వాములుగా ఉన్న వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గచ్చిబౌలి ప్రాజెక్టులో ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించి అక్రమ లబ్ది పొందింటూ సీబీఐ గతంలోనే పేర్కొంది.

అయితే.. తమపై కేసు కొట్టి వేయాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్ సంస్థ వేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తాజాగా తీర్పు వెల్లడించారు. సీబీఐ కోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆధారాలను బట్టి సీబీఐ కోర్టు తేలుస్తుందంటూ క్వాష్ పిటిషన్లను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: