తీవ్ర తుపానుగా మాండౌస్.. ప్రభావం ఎంతగా ఉందంటే ?
మాండౌస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రైతుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే రైతులు వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఇప్పుడు ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందని దిగులు చెందుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పత్తి తడిసిపోతుందేమోనని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మందేవంలో అత్యధికంగా 125.75మిల్లి మీటర్ల వర్షపాతం రికార్డయింది.