తెలంగాణ ఆక్రమణకు మోదీ కుట్ర పన్నారా?
కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. పక్క పార్టీలను పతనం చేస్తే అధికారం శాశ్వతం అనుకున్నారని అదే ఉసురు కేసీఆర్కు తగిలి ఆ పార్టీ పీలికలై పోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెడుతున్నారు. 80వేల మంది రైతులకు రైతు బీమా వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారని.. మరి అదే నిజమైతే అంతమంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ సీఎంగా ఉండటానికి వీల్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.