మా గోడు వినండి.. అర్చకుల విజ్ఞప్తి..?
ధార్మిక పరిషత్తు ఏర్పాటు, అర్చక సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు నియామకం, అర్చక సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అర్చక ప్రతినిధులు, అధికారులతో గ్రీవెన్స్సెల్ ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్య వేదిక ప్రతినిధులు మంత్రిని కోరారు. సెక్షన్ 43 రిజిష్టర్లలో వంశపారంపర్య అర్చకుల పేర్ల నమోదుకు స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్య వేదిక ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అర్చక ప్రతినిధుల వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ హామీ ఇచ్చారు.