కూతురు లవ్‌ మేరేజ్‌ చేసుకుందని.. తండ్రి ఘాతుకం?

Chakravarthi Kalyan
ఇంట్లోంచి వెళ్లిపోయి.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో  కన్న కూతురినే ఓ తండ్రి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత కూతురు డెడ్ బాడీని ట్రాలీ బ్యాగులో కుక్కి రోడ్డు పక్కన పడేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లో ఈ దారుణం జరిగింది. నితేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా తన కుటుంబాన్ని దిల్లీలోని బదర్‌పుర్‌కు తరలించాడు. ఈనెల 18న మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీసు రోడ్డు పక్కన స్థానికులకు ఓ ట్రాలీ బ్యాగు కనిపించింది. అందులో యువతి మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు చెప్పారు.
విచారణలో మృతురాలు ఆయుషీ యాదవ్‌ గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు.. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వెదికితే వివరాలు తెలిశాయి. విచారణలో తండ్రి నేరం ఒప్పుకున్నాడు. చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందన్న కోపంతోనే ఈనెల 17న తుపాకీతో తన కుమార్తెను కాల్చి చంపానని నితేశ్‌ యాదవ్‌ అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతదేహం కాళ్లూ చేతులను మడిచి ట్రాలీ బ్యాగులో కుక్కానని చెప్పాడు. దాన్ని కారులో దిల్లీ నుంచి మథురకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశానని తండ్రి  వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: