కూతురు లవ్ మేరేజ్ చేసుకుందని.. తండ్రి ఘాతుకం?
విచారణలో మృతురాలు ఆయుషీ యాదవ్ గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు.. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వెదికితే వివరాలు తెలిశాయి. విచారణలో తండ్రి నేరం ఒప్పుకున్నాడు. చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందన్న కోపంతోనే ఈనెల 17న తుపాకీతో తన కుమార్తెను కాల్చి చంపానని నితేశ్ యాదవ్ అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతదేహం కాళ్లూ చేతులను మడిచి ట్రాలీ బ్యాగులో కుక్కానని చెప్పాడు. దాన్ని కారులో దిల్లీ నుంచి మథురకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశానని తండ్రి వివరించాడు.