ఆ జీవోతో ఆ కులాలకు ఇబ్బంది.. రద్దు చేయాల్సిందే?
వైసీపీ ఎన్నికల సమయంలో ఈ జీవోను తొలగిస్తామని హామి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షులు రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల దాదాపు 80లక్షల మంది రాజ్యాంగం కల్పించిన హక్కును కోల్పోతున్నారని సంఘం అధ్యక్షులు రమేష్ బాబు చెప్పారు. దీనిపై వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని సంఘం అధ్యక్షులు రమేష్ బాబు హెచ్చరించారు.