విశాఖలో మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే?
విశాఖపట్నంలోని ఎన్ హెచ్ -516సి పైన కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు 6 లేన్ల రోడ్డు - విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్ పోర్ట్ రోడ్డు ప్రాజెక్టు.. మరొకటి విశాఖపట్నం ఫిషింగ్ హార్టర్ ఆధునీకరణ అభివృద్ధి ప్రాజెక్టు.. ఇంకొకటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు. ఇవి కాకుండా కృష్ణా గోదావరి డీప్ వాటర్ బ్లాక్ లో ఒఎన్ జిసి-యు-ఫీల్డ్ ఆన్ షోర్ సదుపాయాల ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చారు. మరొకటి ఎన్ హెచ్-326ఎ యొక్క నరసన్నపేట నుండి పాతపట్నం వరకు పునరావాసం అభివృద్ధి ప్రాజెక్టు.. ఇంకొకటి శ్రీకాకుళం - గజపతి కారిడార్లో పవెడ్ షోల్డర్తో 2 లేన్లకు విస్తరించే ప్రాజెక్టు. ఇలా మొత్తం 10742 కోట్లతో ప్రాజెక్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ.