పవన్.. రెచ్చగొట్టొద్దు.. విడదల రజని వార్నింగ్?
పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయం చేయడం కోసమే ఇప్పటం గ్రామానికి వెళ్ళాడని మంత్రి విడదల రజని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోవడంతో చంద్రబాబుపై వారే రాళ్ల దాడి చేసుకుని మాట్లాడుతున్నారని మంత్రి విడదల రజని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పనులను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి విడదల రజని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా 3255 సేవలు అందిస్తున్నట్లు మంత్రి విడదల రజని వివరించారు.