ఇక వాళ్లకే టిక్కెట్లు.. తేల్చేసిన చంద్రబాబు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వాళ్లే టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. ఈసారి ఏ స్థాయి నేతల కోసమైన తాము సీట్లు అట్టి పెట్టేది లేదని తేల్చి చెబుతునత్నారు. పార్టీ కోసం పోరాడితేనే ఉంటారు.. లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెగేసి చెబుతున్నారు.

పార్టీ.. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజన్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని... విద్వేషాలు ఉంటే కావని చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు పోరాటాలు చేయకుండా.. కేవలం పత్రికా ప్రకటనలతోనే నాయకులు గా చెలామణీ అవుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వారిని ఇక ఉపేక్షించబోమని.. ఎంతటి వారైనా క్షేత్ర స్థాయిలో పని చేస్తేనే టికెట్లు వస్తాయని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: