జగన్‌కు ఓట్లేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు?

Chakravarthi Kalyan
జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి దళితులంతా చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు  నక్కా ఆనంద్ బాబు. అనంతపురం జిల్లాలో ఎస్సీ కానిస్టేబుల్ డిస్మిస్‌పై ఆయన స్పందించారు. దళితుడు కాబట్టే ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఉద్యోగం తీసే వరకూ కక్షపూరితంగా వ్యవహరించారని నక్కా ఆనంద్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండానే ప్రకాష్ పై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు అదే జిల్లాలో ఎంపీ మాధవ్ వీడియో పై ఫిర్యాదు లేదని నక్కా ఆనందబాబు అన్నారు.  గోరంట్ల మాధవ్‌కు మాత్రం  రాచమర్యాదలు చేస్తారా అని ఆనందబాబు నిలదీశారు. న్యాయమైన బకాయిలు చెల్లించాలని చిన్న నిరసన తెలిపిన ప్రకాష్ పట్ల ప్రభుత్వ చర్యలు అమానవీయమని ఆనందబాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు దళితుల పట్ల కపట ప్రేమ గుప్పించి ఇప్పుడు కక్ష సాధింపులకు దిగటం సిగ్గుచేటని నక్కా ఆనందబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: