కడప జిల్లాలో వైఎస్‌ జగన్ టూర్‌.. ఏం చేస్తారంటే?

Chakravarthi Kalyan
సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 3 వ తేదీ వరకు కడప జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి  గన్నవరానికి సీఎం బయలు దేరతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ ప్రారంభిస్తారు.

తర్వాత ఇడుపులపాయ చేరుకుని రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్‌ 2 న ఉదయం 8.50 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ కు చేరుకుని.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం పాల్గొంటారు. 9.45 గంటలకు ఎస్టేట్‌ ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలను సమీక్షిస్తారు. సెప్టెంబర్‌ 3 న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: