ఒకే కాన్పులు నలుగురు.. అప్పటికే ఇద్దరు?
అప్పుడే స్కానింగ్ లో గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు తేలింది. దీంతో ఉన్నిసాను ఏడోనెలలోనే ఆసుపత్రిలో చేర్పించారు. 10 మంది వైద్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ ఉన్నీసా ఆరోగ్యాన్ని నీలోఫర్ వైద్యులు పర్యవేక్షించారు. 8వ నెల పూర్తి కాగానే ఆపరేషన్ చేసి నలుగురు శిశువులను బయటకు తీశారు. నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయిల్లో ఒకరు 1.7 కేజీలు, మరొకరు 1 కేజీ, మూడో చిన్నారి 1.3 కేజీలు ఉన్నారు. పాప 1.5 కేజీల బరువుతో పుట్టింది. తల్లి, చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని నీలోఫర్ వైద్యులు తెలిపారు.