అప్పటి నుంచే సీఎంల జెండా వందనం..? ఆయన వల్లే?
మరి సీఎంలకు ఆ అవకాశం ఎప్పటి నుంచి దక్కింది.. ఎలా దక్కింది అంటారా.. ఈ అవకాశం తమిళనాడు సీఎం కరుణానిధి కారణంగా వచ్చింది. 1973 వరకూ దిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే త్రివర్ణ పతాకం ఎగరేసేవారు. 1969లో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై వివక్ష తగదంటూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రాల్లో సీఎంకు పతాకావిష్కరణ అవకాశం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఈ డిమాండ్ను ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించింది. 1974 ఆగస్టు 15 నుంచి... సీఎంలు కూడా త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించటం ప్రారంభించారు. జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేసే విధానం వచ్చింది.