చినజీయర్ పై మళ్లీ అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు?
అయితే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల కాలంలో తిరుపతిని సర్వనాశనం చేసింది కదా.. మరి అవేమీ చినజీయర్ స్వామికి కనిపించవా అన్ని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వెంకన్న స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదంటూ సినీ నిర్మాత అశ్వినీ దత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతుంటే చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదని సినీ నిర్మాత అశ్వినీ దత్ ప్రశ్నించారు. ఆ మధ్య చినజీయర్ స్వామి జగన్ను దైవాంశ సంభూతుడని పొగిడారని.. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయిందని అశ్వినీదత్ అన్నారు.