ఖాతాల్లో డబ్బులు వేయనున్న జగన్‌.. చెక్ చేసుకోండి?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇవాళ పలువురు ఖాతాల్లో డబ్బు వేయనున్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాక దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ది చేకూర్చనున్నారు. డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని వారికి పథకాలు మంజూరు చేస్తున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద కొత్తగా 2,99,085 మందికి లబ్దిదారుల ఎంపిక చేసిన ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు వేయనుంది.
అలాగే ఈ ప్రభుత్వం కొత్తగా  7,051 బియ్యం కార్డులు మంజూరు చేసింది. అలాగే. కొత్తగా 3035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది. మొత్తం 3,39,096 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ సీఎం జగన్ రూ.137 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. కంప్యూటర్  బటన్‌ నొక్కి లబ్దిదారుల  ఖాతాల్లో సీఎం జగన్  నగదు  జమ చేయనున్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ధ్యేయమని సీఎం జగన్ తరచూ చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: