చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి?
శిరీష ఇవాళ చరిత్రలో నిలుస్తోందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మహిళలకు ఈ రంగంలో అవకాశం తక్కువ అని.. గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200 పైచిలుకు లైన్ ఉమెన్ లను ట్రాన్స్ కో లో తీసుకున్నామని ఆయన తెలిపారు. కానీ టీఎస్ ఎస్పీ డీసీఎల్ లో తొలిసారిగా మహిళను లైన్ ఉమెన్ తీసుకున్నామన్నారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్ గా ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడిసిఎల్ నిలుస్తోందని మంత్రి అన్నారు.