బ్రేకింగ్: వణికిపోతున్న ఏపీ పోలీసులు...?
కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు కరోనా సోకింది. కరోనా సోకిన పోలీసులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి.. మీడియాకు వివరించారు. కరోనా సోకిన పోలీసు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు అని ఆయన అన్నారు. వాళ్ళ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాము.. ఎవరికి సీరియస్ గా లేదు అన్నారు.