బ్రేకింగ్: వణికిపోతున్న ఏపీ పోలీసులు...?

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కోనసీమలో కరోనా కలకలం రేగింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కరోనా పంజా విసిరింది అని తెలుస్తుంది. అమలాపురం డివిజన్ పరిధిలో 10 పోలీసులకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సమాచారం.
కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు కరోనా సోకింది. కరోనా సోకిన పోలీసులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి.. మీడియాకు వివరించారు. కరోనా సోకిన పోలీసు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు అని ఆయన అన్నారు. వాళ్ళ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాము.. ఎవరికి సీరియస్ గా లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: