బ్రేకింగ్: సడెన్ గా ఢిల్లీ పర్యటనకు ఏపీ డీజీపి

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కీలక అధికారులతో భేటీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. డీజీపీ గౌతం సవాంగ్ ఎందుకు వెళ్ళారు ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా ఆయన కేంద్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయ అధికారులతో భేటీ అవుతారని అంటున్నారు.
ఇక ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నీతి అయోగ్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. అలాగే ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అదనపు అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రతీ నేలా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే వెళ్లినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

dgp

సంబంధిత వార్తలు: