డ్రోన్ లతో 5 నిమిషాల్లో రక్తం, మందుల సరఫరా : కేటిఆర్

వికారాబాద్ లో మంత్రి కేటీఆర్ డ్రోన్స్ ల ద్వారా మందుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...భారత దేశం మొదటి సారి డ్రోన్ ల ద్వారా మందులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కొత్త టెక్నాలజీ తీసుకువస్తే పేదలకు ఎంత వరకు లాభం అని అడుగుతారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో కావాల్సి మందులను మరియు రక్తాన్ని వ్యాక్సిన్ లని ఐదు నిమిషాల్లో చేరవేయవచ్చని కెటిఆర్ చెప్పారు.

అత్యవసర పరిస్థితులలో అత్యాధునిక టేక్నాలజీ.... ట్రాఫిక్ జామ్ లేకుండా పంపవచ్చని కేటీఆర్ తెలిపారు. డ్రోన్ ల ద్వారా కేవలం మందులే కాదు అనేక పనులు చేయవచ్చు అని పట్ణణాల చిత్రాలు
మహిళలను వేధిస్తుంటే తన ఫోన్లో బటన్ నోక్కితే సంఘటనను డ్రోన్ విడియో తీసే అవాకాశం కూడా ఉంటుందన్నారు. అమెరికాలో వారి పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా మందులు పిచికారి చేస్తారన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో ఎంతో మేలు జరగబోతుంది. ముఖ్యంగా నగరం లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయం లో రోగులకు అత్యవసర మందులు సప్లై చేసేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: