ఢిల్లీ టూర్ లో కేసీఆర్... నిర్మలమ్మతో భేటీ...?

తెలంగాణా సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అవుతుంది. ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. హోం శాఖా మంత్రి అమిత్ షా అలాగే కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే నితిన్ గడ్కరీలతో సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణాలో ఉన్న సమస్యలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. నేడు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను కేసీఆర్  కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె తో పాటుగా కేంద్ర న్యాయ శాఖా మంత్రిని అలాగే మరికొందరితో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: