సామూహిక సహకారం ద్వారా మాత్రమే ఉగ్రవాద సంస్థలను మరియు వారి నెట్వర్క్లను దెబ్బకొట్టగలమని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆసియా రక్షణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ....ఉగ్రవాదం మరియు రాడికలైజేషన్ ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉందని అన్నారు. కాబట్టి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) సభ్యుడిగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. క్రిప్టోకరెన్సీ దొంగతనాల సంఘటనల ద్వారా సైబర్ హెచ్చరికలు వస్తున్నాయని అంతే కాకుండా అవి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: