కోఠి ఆసుపత్రికి ఒక్కరొకే 284 బ్లాక్ ఫంగస్ కేసులు

Mamatha Reddy
రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి గురువారం ఒక్క రోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు రాగ ఇప్పటికే 39 మందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. మిగతావారికి సైతం ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికి అందులో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడం, అలాగే మరికొంతమందిని కరోనా వచ్చి తగ్గడంతో చేర్చుకోలేదని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ఇక లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి మందులు ఇచ్చి పంపించేసినట్టుగా తెలుపుతున్నారు. మొత్తానికి తెలంగాణాలో ఇప్పటి వరకు చేరిన బాధితుల సంఖ్య 90 కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: