బ్రేకింగ్‌: సాగ‌ర్లో ఆధిక్యంలో జానారెడ్డి... ఇదే ట్విస్ట్‌

VUYYURU SUBHASH
సాగ‌ర్లో 16వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 10, 158 ఓట్ల ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. తొలి రౌండ్ నుంచి ప్రారంభ‌మైన నోముల భ‌గ‌త్ ఆధిక్యం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. విచిత్రం ఏంటంటే జానారెడ్డి త‌న సొంత మండ‌లం అయిన అనుముల‌లో కూడా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. అనుముల‌లో మూడు రౌండ్ల‌కు గాను కేవ‌లం ఒకే ఒక్క రౌండ్‌లో మాత్ర‌మే జానాకు ఆధిక్యం వ‌చ్చింది. అది కూడా స్వ‌ల్ప ఆధిక్యం. గ‌త ఎన్నిక‌ల్లో అనుముల మొత్తం మీద జానాకు 230 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీ వ‌స్తే.. ఈ సారి ఈ మండ‌లంలో కౌంటింగ్ జ‌రిగిన మూడు రౌండ్ల‌లో కేవ‌లం ఒక్క రౌండ్‌లో మాత్ర‌మే మెజార్టీ వ‌చ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: