రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ స‌ర్జ‌రీ స‌క్సెస్‌

VUYYURU SUBHASH
భార‌త రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ స‌క్సెస్ అయ్యింది. ఈ విష‌యాన్ని న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గుండె నొప్పితో ఎయిమ్స్ లో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు ఆప‌రేష‌న్ చేయాల‌ని వైద్యులు ముందుగానే సూచించారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఆయ‌న ఆప‌రేష‌న్ విష‌యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులకు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: