తెలంగాణలో లాక్ డౌన్ లేదు..ప్రభుత్వం వెల్లడి..!!
తాజాగా ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఓల్డ్ సిటీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ , వీకెండ్ లాక్ డౌన్ లు విధించే ప్రణాళికలు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అనేది ప్రజల జీవితలపై ప్రభావం చూపుతుందని అందుకే కర్ఫ్యూ విధించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. పాఠశాలల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పని చెయ్యనివ్వలా..లేదా..అనే దానిపై ప్రభుత్వం మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. .